PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ ఆఫీసులను మార్కెట్లుగా మారుస్తాం: టికాయత్

1 min read


పల్లెవెలుగు వెబ్: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై భారికేడ్లను పోలీసులు తొలగించడంపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ స్పందించారు. ఢిల్లీ సరిహద్దుల నుంచి వెనుదిరిగేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళా బలవంతంగా తమను తరలించాలని చూస్తే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సరిహద్దుల్లోని టెంట్లను తీసేస్తే పోలీస్ స్టేషన్లు, జిల్లా కలెక్టరేట్ల ముందు వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ‘వ్యవసాయ మార్కెట్లు’గా మారుస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమను బలవంతంగా పంపించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని టికాయత్ హితవు పలికారు. ఇటీవల సుప్రీం ఆదేశాలతో టిక్రి, ఘాజియాబాద్ సరిహద్దుల్లో బారికేడ్లను అధికారులు తొలగించారు. ఈనేపథ్యంలో టికాయత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఏడాదిన్నర కాలంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

About Author