PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుండెపోటుతో రైతు మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరెవుల గ్రామ పంచాయతీ లోని వంకగడ్డారచపల్లికి చెందిన రైతు సాకిరాజు వెంకట్రామరాజు (60 ) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. గత నాలుగేళ్లుగా రాయచోటిలో నివాసం ఉండే వెంకట్రామరాజు .. వంకగడ్డరాచపల్లిలోని తన పొలంలో సాగు చేసే వారు. రాయచోటిలోని తన నివాసంలో నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో ఆకస్మికంగా గుండె నొప్పి రావడంతో కుమారుడు ఆనంద గజపతి రాజు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే వెంకట్రామరాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.

About Author