PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రీసర్వేరాళ్ళు హద్దులు పాతెందుకు రైతులకు అవగాహన

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండలం పరిధిలోని ఐరన్ బండ గ్రామ సచివాలయంలో వీఆర్వో శ్రీనివాసులు సర్వేయర్ రాజశేఖర్ , యుగంధర్ రెడ్డి లు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే రైతులకు రీ సర్వే ప్రకారం కొత్త పాస్ బుక్కులు వచ్చాయని, వాటి ప్రకారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రైతుల పొలాల్లో రి సర్వే రాళ్లు హద్దులు పాతెందుకు ప్రభుత్వం నిర్ణయించిందని దీన్ని రైతులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసన్న, ఎంపీటీసీ మునేశ్వర్ రెడ్డి, తలారులు బడేసా, రంగన్న, సచివాలయ సిబ్బంది, గ్రామ నాయకులు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author