PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

1 min read

– టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి

మంత్రాలయం, పల్లెవెలుగు:వర్షాలు సరిగా లేక పంటలు సరిగా పండక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రాగిపాటి బజారప్ప అనే రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి కోరారు. శుక్రవారం మండల పెద్దకడుబూరు మండలం బసలదొడ్డి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న బజారప్ప మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. మృతుని కుటుంబానికి ఎల్లవేలల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే మట్టి ఖర్చులకు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న,ఐ టిడిపి కురువ క్రిష్ణ తదితరులు నివాళులు అర్పించారు.

About Author