PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారుల పై పెట్రోల్ పోసిన రైతులు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: చెంచులు సాగు చేసుకుంటున్న భూముల‌ను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అట‌వీశాఖ అధికారుల పై గిరిజ‌న రైతులు పెట్రోల్ తో దాడి చేశారు. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండ‌లం మాచారంలో అట‌వీ భూముల‌ను చెంచులు సాగు చేసుకుంటున్నారు. ప్లాంటేష‌న్ కార్యక్రమం చేప‌ట్టేందుకు అట‌వీ అధికారులు రైతుల‌తో ప‌లుమార్లు చ‌ర్చించారు. భూముల‌ను స్వాధీనం చేసుకునే ప్రయ‌త్నం చేశారు. దీంతో అట‌వీ అధికారులపై గిరిజ‌న రైతులు పెట్రోల్ తో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎమ్మెల్యే గువ్వల బాల‌రాజు అక్కడికి చేరుకుని రైతుల‌ను శాంతింప‌జేశారు.

About Author