NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

32వ రోజు చేరుకున్నరీలే నిరాహారదీక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:  నారా చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్ట్ కి నిరసనగా బాబు తో మేము సైతం అంటూ డోన్ లో 32వ రోజు ప్యాపిలి మండలం, బోంచెర్వుపల్లె గ్రామ టిడిపి నాయకులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి,రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ  సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో  డోన్ నియోజకవర్గ టిడిపి సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్, డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్, నంద్యాల జిల్లా టిడిపి కార్యదర్శి అబ్బిరెడ్డిపల్లె గోవిందు, డోన్ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ రెడ్డి, ప్యాపిలి మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి మెట్టుపల్లె సుదర్శన్, పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ, నియోజకవర్గ టిడిపి రైతు కమిటీ అధ్యక్షులు మల్లయ్య, నియోజకవర్గ టిడిపి తెలుగుయువత అధ్యక్షులు కుమ్మరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author