NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగ సంఘాల హెచ్చరిక‌ల‌కు భ‌య‌ప‌డం..

1 min read

పల్లెవెలుగు వెబ్​: డిమాండ్ల ప‌రిష్కారం కోసం ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం పై ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి కీల‌క వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ హామీలను రాష్ట్ర ప్రభుత్వం ప‌రిశీలిస్తోంద‌ని తెలిపారు. ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు త‌ప్పకుండా అమ‌లు చేస్తామ‌న్నారు. ఉద్యోగ సంఘాల నేత‌లు రాజ‌కీయ ప్రక‌ట‌న‌లు చేయ‌డం స‌రైంది కాద‌ని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వ‌ల్ల ఉద్యోగుల‌కు మేలు జ‌ర‌గ‌డం కంటే నష్టం ఎక్కువ క‌లిగిస్తాయ‌న్నారు. హెచ్చరిక‌లు చేయడం వ‌ల్ల తాము వెన‌క్కి త‌గ్గమ‌ని తెలిపారు. వారంలోపు పీఆర్సీ ప్రక్రియ పూర్తవుతుంద‌ని భావిస్తున్నట్టు ఆయ‌న తెలిపారు.

About Author