PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జులై చివ‌రిలో ప‌ది, ఇంట‌ర్ పరీక్షలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: జులై నెల చివ‌రి వారంలో ప‌ది, ఇంట‌ర్ పరీక్షలు నిర్వహిస్తామ‌ని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. రాష్ట్రంలో క‌రోన కేసులు వేగంగా త‌గ్గుతున్నాయ‌ని, క‌రోన ప‌రిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామ‌ని అఫిడ‌విట్ లో పేర్కొంది. క‌రోన కేసుల వివ‌రాల‌ను ఏపీ ప్రభుత్వం అఫిడ‌విట్ లో పొందుప‌రిచింది. ఈ మేర‌కు రాష్ట్ర పాఠ‌శాల విద్యాశాఖ కార్యద‌ర్శి సుప్రీం కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. ఏపీలో ఒక్క విద్యార్థి ప్రాణం కోల్పోయిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల‌ని ఇటీవ‌ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప‌రీక్షల విష‌యంలో అనిశ్చితి ఎందుకు సృష్టిస్తున్నార‌ని ప్రశ్నించింది. వీటి మీద అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలోనే బుధ‌వారం ప్రభుత్వం త‌ర‌పున సుప్రీం కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు.

About Author