NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఢిల్లీలో ఐదో వేవ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశవ్యాప్తంగా కొవిడ్ మూడవేవ్ ప్రారంభం కాగా.. ఢిల్లీలో ఐదో వేవ్ మొదలైందని ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు‌. బుధవారం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 10వేలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు. కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి చేరిందన్నారు. మరోవైపు ఢిల్లీలో.. గడిచిన 24 గంటల్లో 5వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పటికే 2శాతం బెడ్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

                                      

About Author