NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు

1 min read


పల్లెవెలుగు వెబ్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు కష్టాలు వీడడం లేదు. తాజాగా శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుద్రాపై చీటింగ్ కేసు నమోదైంది. పూణేకు చెందిన యశ్ నితిన్ బరాయ్ అనే యువకుడి ఫిర్యాదు మేరకు ముంబాయి పోలీసులు కేసు నమోదు చేశారు. నితిన్ బరాయ్‌కు పూణేలోని ఇంద్రప్రస్థలో స్థలం ఉంది. అక్కడ ఫిట్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు తమ ఫ్రాంచైజీ తరుపున పెట్టుబడి పెట్టాలని శిల్పాశెట్టి దంపతులు కోరారు. లాభాలు వస్తే.. వాటా ఇస్తామని కూడా నమ్మించారు. దీంతో సదరు యువకుడు తన తండ్రి ద్వారా మూడు దఫాలుగా రూ.1.51 కోట్లు చెల్లించాడు. ఈ వ్యవహారమంతా 2014లో జరిగింది. అయితే ఫిట్‌నెస్ సెంటర్‌ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు శిల్పాశెట్టి దంపతులు. దీంతో తమ డబ్బు తిరిగి ఇవ్వాలని నితిన్ బరాయ్ కోరగా.. అతన్ని బెదిరించారు. దీంతో అతడు ముంబై పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్ కుద్రా, శిల్పా శెట్టిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.

About Author