PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐటీ రిటర్ను దాఖ‌లు.. కేంద్రం శుభ‌వార్త

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐటీ రిట‌ర్ను దాఖ‌లు చేసే వారికి కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఐటీ రిటర్నుల దాఖ‌లు గ‌డువును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పొడిగించింది. మంగళవారం ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. పన్ను చెల్లింపుదారులు, సంబంధిత వ‌ర్గాలు కోరిన మేర‌కు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క‌రోన తోపాటు, ఆడిట్ రిపోర్టులను ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపింది. ఈ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఐటీ రిటర్నుల దాఖలు గడువును 2022 మార్చి 15 వరకు పొడిగించినట్లు పేర్కొంది.

                                    

About Author