PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేయండి   

1 min read

– ఏపీ మోడల్ స్కూలు, కాలేజీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేయండి   

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ  ఏపీ మోడల్ స్కూల్, కాలేజీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఎస్.ఎఫ్. ఐ. డిమాండ్ చేసింది. పత్తికొండ ఏపీ మోడల్ స్కూల్, కాలేజీలో ఖాళీగా ఉన్న  ఏపీ మోడల్ ఉపాధ్యాయ, అధ్యాపకులను నియమించాలని కోరుతూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమం ఎస్ఎఫ్ఐ మండల నాయకులు అబ్దుల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ,  పత్తికొండ ఏపీ మోడల్ స్కూల్  మరియు కాలేజీల్లో విద్యార్థులకు బోధించడానికి బయాలజీ, మాథెమాటిక్స్  జువాలాజి అధ్యాపకులు, నాన్ టీచింగ్ అటెండర్ పోస్టులు ఎంతో కాలంగా ఖాళీగాఉన్నాయన్నారు.   ఖాళీగా ఉన్న సుజాత ఉపాధ్యాయ పోస్టులను  నియమించాలని ఎన్నో సార్లు అధికారులకు విన్నవించుకున్న ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా ఏపీ మోడల్ స్కూల్లో ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ ఆద్వరంలో స్థానిక పత్తికొండ లో ఏపి మోడల్ స్కూల్ నుండి బైపాస్ వరకు విద్యార్థులతో పాటు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అక్కడ నుండి,  బై పాస్ రోడ్డుపై లో నిరసన వ్యక్తం చేశారు. అక్కడ పోలీసులు జోక్యం చేసుకోవడంతో, ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు స్థానిక ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ఆర్డీవో ఆఫీస్ ముందు విద్యార్థులు బైఠాయించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రెవెన్యూ అధికారులకు అందజేశారు. ఇప్పటికైనా ఏపీ మోడల్ స్కూల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోతే భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. అవసరం అయితే చలో కలెక్టరేట్ కు విద్యార్థులకు పిలుపునిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు అబ్దుల్లా, గణేష్,రవి,వినోోద్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

About Author