PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్​: కడప జిల్లా చెన్నూరు కొత్త గాంధీనగర్ కు చెందిన పుటిక జయరాముడు సోమవారం మృతిచెందడంతో ఈ సమాచారాన్ని  వైస్సార్సీపీ నాయకులు , మూడవ సెగ్మెంట్ ఎం పి టి సి పైడి కాలువ చంద్రశేఖర్, ఇల్లూరి వెంకట రమణ  ,లు వైఎస్ఆర్ సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకోనిపోవడం జరిగింది, ఆయన వెంటనే స్పందించి ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి అన్నివేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ కమలాపురం శాసనసభ్యులు పి, రవీంద్ర నాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అయిన  పోచమ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతుని కుటుంబ సభ్యులకు శనివారం సాయంత్రం,  5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పుటిక ప్రసన్న కుమార్, వై ఎస్ ఆర్ సి పి నాయకులు, కార్యకర్తలు ,స్థానికులు ,  తదితరులు పాల్గొన్నారు.

About Author