NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవస్థానం నిర్మాణానికి ఆర్థిక సహాయం 

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: మండలంలోని దౌలాతాపురం ఎస్టీ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీ కక్కయ్య స్వామివారి దేవస్థాన నిర్మాణ మునకు పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య సాయి నాధ శర్మ పదివేల రూపాయల ఆర్థిక సాయం తన శిష్య బృందం నుండి ఆదివారం ఇవ్వడం జరిగిందని సాయినాథ శర్మ అభిమానులు పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్, జనార్దన్ రెడ్డిలు తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా నాయకుడిగా మానవతావాదిగా మానవత హృదయం కలిగిన సత్య సాయి నాధ శర్మ అని వారు తెలిపారు, నియోజకవర్గంలో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న కమలాపురం నియోజకవర్గ ప్రజానాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ, ప్రజా సమస్యల పట్ల వారితో మమేకమవుతున్న తీరు నిరుపేదల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తోందని తెలిపారు, ఏవైనా సమస్యలు ఉండి, నిరుపేదలైయుండి, ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి ఆయన వెన్నుదన్నుగా నిలవడం తో పాటు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు, ఇందులో భాగంగానే కమలాపురం నియోజకవర్గం లోని  చెన్నూరు మండలం దౌలతాపురం  ఎస్టీ కాలనీలో దేవాలయ నిర్మాణానికి సహాయం చేయవలసిందిగా, ఆలయ నిర్మాణ చైర్మన్ చాట్ల రాజన్న అడిగిన వెంటనే సత్య సాయి నాధ శర్మ పదివేల రూపాయలు ఆలయ నిర్మాణానికి ఇవ్వడం జరిగిందన్నారు, ఈ పదివేల రూపాయలు వారికి సాయినాథ శర్మ చారిటబుల్ ట్రస్ట్ అయిన పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందివ్వడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమంలో సంతోష్ ,ప్రసాద్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author