NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిత్రుని కుటుంబానికి ఆర్థిక చేయూత             

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కుటుంబ పెద్ద అకాల మృతి చెందడంతో ఆపదలో ఉన్న సహచర మిత్రుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని తోడ్పాటునందించిన మిత్రులు తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. పత్తికొండ పట్టణం పేరు బజారులో కాపురం ఉన్న మస్తాన్ ఇటీవల అనారోగ్యంతో అకాల మృతి చెందాడు. అతనికి భార్య ముగ్గురు పిల్లలు తల్లి ఉన్నారు. మస్తాన్ అకాల మృతితో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఇబ్బందులు పడుతోంది. ఈ విషయాన్ని గమనించిన సహచర మిత్రులు తమ మిత్రుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో అందరూ కలిసి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఆదివారం మృతుడు మస్తాన్ మిత్రబృందం వారి ఇంటికి వెళ్లి 85 వేల  వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. శ్రీరామ హాస్పిటల్ కృష్ణ, ఉపాధ్యాయులు రాజేష్ వారి మిత్రులు అక్కడికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు.

About Author