NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది దేవస్థానం లో పనిచేస్తున్న డిపి శివకుమార్ మంగళవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. దహన సంస్కారాలకు గాను మహానంది దేవస్థానం తరపున 15వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. మృతుడి కుటుంబానికి ఆలయ సూపర్డెంట్ వెంకటేశ్వర్లు పాలకమండలి సభ్యులు మల్లికార్జున శెట్టి ఆలయ ఉద్యోగులు నాగభూషణం రాజు మరియు రిటైర్డ్ ఉద్యోగులు పలువురు మృతదేహానికి నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.

About Author