PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతుని కుటుంబానికి పోచిమి రెడ్డి సేవాదళ్ ఆర్థిక సాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణానికి చెందిన టైలర్ కరీం సోమవారం అకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న శ్రీ పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి టైలర్ కరీం కుటుంబానికి రూ.5000/- ఆర్థిక సాయం అందించారు.జగనన్నకు తోడుగా పేద ప్రజలకు అండగా ఏర్పాటు చేసిన పోచిమిరెడ్డి సేవాదళ్ నందు ఫ్యూరిఫైడ్ త్రాగునీటి సరఫరా, ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను అన్ని విధాల ఆదుకునేలాగా ముందుకు సాగుతున్న సేవాదళ్ నందు సభ్యులకు చేయూతనందిస్తుంది. పుల్లూరు బావిదగ్గర నివాసం ఉంటున్న టైలర్ కరీం కొంతకాలంగా అపెండిసైటీస్ వ్యాధితో బాధ పడుతూ, సోమవారం ఉదయం మరణించాడు. విషయం తెలుసుకున్న శ్రీ పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి  అంత్యక్రియలకు రూ. 5000 /- ఆర్థిక సహాయం చేశారు. ఆ మొత్తాన్ని వార్డ్ మెంబర్ లైట్ నాగరాజు, బోడా శ్రీను కుటుంబ సభ్యులకు అందజేశారు.

About Author