PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అటెండర్ కు ఆర్థిక సహాయం అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిషత్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న రాముడు కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అధికారులు అందజేశారు.శుక్రవారం రోజు రాముడు ఇంట్లో వాటర్ హీటర్ స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే ఉండడం వల్ల మంటలు వచ్చి ఇంట్లో ఉన్న బియ్యం,సరుకులు మరియుతలుపులు కాలిపోయాయి.అందుకుగాను ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,ఏపీఓ భూపన జయంతి 11 వేల రూపాయల నగదును రాముడు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఏపీఓ తెలిపారు.ఎంపీడీవో కార్యాలయ పరిపాలన అధికారి సురేష్ కుమార్ మరియు ఉపాధి హామీ పథకం సిబ్బంది సహకారంతో నగదును శనివారం అందజేశారు.ఈకార్యక్రమంలో ఈసీ నరేష్,కడుమూరు పంచాయితీ కార్యదర్శి బి. శివకళ్యాణ్ సింగ్,టెక్నికల్ అసిస్టెంట్లు నాగయ్య, రాములమ్మ తదితర ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

About Author