PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయుల… ఆర్థిక బకాయిలు విడుదల చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి మండల ఎస్టీయు  నాయకుల సమావేశంలో ఎస్టీయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజు, ప్యాపిలి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రమౌళి, చిన్నపరెడ్డి లు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థికపరమైన బకాయిలు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆర్జిత సెలవు బకాయిలు, జీవిత బీమా బకాయిలు, డీ.ఏ.బకాయిలు, 11వ పిఆర్సి బకాయిలు ఇలా చాలా రకాల ఆర్థిక బకాయిలు ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నాయి. వీటి గురించి ప్రభుత్వం దృష్టికి  తీసుకువెళ్లినప్పటికీ వాటి చెల్లింపులు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల మంది ఉపాధ్యాయులు ఈ చెల్లింపులు జరుగక చాలా నష్టపోతున్నారు. చాలా కాలంగా వీటి కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలోని ఒక లక్షా డెబ్బైవేల మంది ఉపాధ్యాయులకు ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న అన్ని రకాల ఆర్థిక బకాయిలు అన్నింటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజు మరియు ఎస్టీయు ప్యాపిలి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రమౌళి ,చిన్నపరెడ్డి లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు కార్యవర్గ సభ్యులు నాగరాజు,  ఎస్టీయు ప్యాపిలి కార్యవర్గ సభ్యులుమద్దిలేటి, శ్రీనివాసులు,రామాంజనేయులు,మధుసూదన్, శివ తదితరులు పాల్గొన్నారు.

About Author