PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్సీ ఎస్టీ కేసులు త్వరితగతన ఎఫ్ఐఆర్ చేయండి

1 min read

రాజు, చంద్రశేఖర్
పల్లెవెలుగు వెబ్ కంకిపాడు : ఎస్సీ ఎస్టీ కేసులను త్వరితగతిన ఎఫ్ఐఆర్ చేయాలని, ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు గోగులమూడి రాజు, అన్నారు. కంకిపాడు ఎస్సైకె.సుధాకర్ ను బుధవారం నాడు ప్రజా సంఘాల నాయకులు పివి రావు మాల మహానాడు ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు గోగులమూడి రాజు, మరియు దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పాతూరి చంద్రశేఖర్. సిఐటియూ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు. మర్యాదపూర్వకంగా బుధవారం నాడు కలవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా రాజు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసులు విషయంలో వెంటనే ఎఫ్ఐఆర్ చేసి నిందితులను అరెస్టులు చూపాలని, బాధితులకు పోలీసు శాఖపై నమ్మకం కల్పించేలా చేయాలనిఅలాగే కంకిపాడు మండలంలోగుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి అని యువత మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తులను కోల్పోతున్నారఅని ఇకనైనా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఎస్సై కె.సుధాకర్ ను కోరటం జరిగిందని అన్నారు.

About Author