PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజ‌య‌వాడ కోర్టులో అగ్నిప్ర‌మాదం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజ‌య‌వాడ‌ బీసెంట్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ కమర్శియల్ కాంప్లెక్స్‌లోని రెండు ఫ్లోర్‌లలో రెండు కోర్టులు ఉన్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అదే కాంప్లెక్స్‌లో బ్యాంక్‌తో పాటు మరి కొన్ని కార్యాలయాలు ఉన్నాయి. అంతటా మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

                                           

About Author