PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అగ్నిప్రమాదం.. 50 మంది మృతి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బంగ్లాదేశ్ లోని ఢాకా శివార్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 50 మందికి పైగా మ‌రణించారు. 30 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ప‌దుల సంఖ్యలో జ‌నం గ‌ల్లంత‌య్యారు. ఢాకా శివార్లలోని నారాయ‌ణ్ గంజ్ లో ఉన్న షెజాన్ జ్యూస్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభ‌వించింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రారంభ‌మైన మంట‌లు క్రమంగా ఆరు అంత‌స్థులు విస్తరించాయి. చాలా మంది కార్మికులు మంట‌ల నుంచి త‌ప్పించుకుని దూకేందుకు ప్రయ‌త్నించి గాయ‌ప‌డ్డారు. అగ్నిమాప‌క సిబ్బంది మంట‌లు ఆర్పేందుకు ప్రయ‌త్నిస్తోంది. క్షత‌గాత్రుల‌ను ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై ప్రభుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది.

About Author