PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తొలి ‘గే’ వివాహం.. ఒకటి కానున్న ప్రేమికులు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: తెలంగాణలో తొలిసారి ఇద్దరు స్వలింగ సంపర్కులు పెళ్లితో ఒక్కటి కానున్నారు. హైదరాబాద్‌కు చెందిన సుప్రియో, అభయ్‌లకు 2013లో డేటింగ్‌ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వీరిద్దరు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుప్రియో హైదరాబాద్ లోని ఓ హోటల్‌ మెనేజ్‌మెంట్‌ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అభయ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. వచ్చే డిసెంబర్ లో వివాహంతో ఒక్కటి కానున్నట్టు సుప్రియో జంట ఒక ప్రకటనలో తెలిపారు.

About Author