PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి

1 min read

– పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకు మద్దతుగా ప్రచారం..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పోతుల నాగరాజు గారికి మద్దతుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలో గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడివేముల ఏపీ మోడల్ స్కూల్ గడివేముల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రభుత్వ కార్యాలయాలలో గురువారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోతుల నాగరాజు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న అలుపెరగని ఉద్యమకారుడు గత 33 సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమాలలో ఎన్నో పోరాటాలు చేసి విజయాల సాధించిన మహోన్నత వ్యక్తి పోతుల నాగరాజు గారిని గెలిపించాలని వారు కోరారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ జిల్లా నాయకులు నక్క రాజేష్ మనోహర్ అనిల్ కుమార్ వాల్మీకి సంఘం నాయకులు మిద్దె వెంకట నాయుడు వెంకటరమణ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author