NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు విద్యార్థికి.. APGPCET లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్…

1 min read

పల్లెవెలుగు, కల్లూరు అర్బన్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలల సంస్థ  నీట్‌, ఐఐటీ ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశం కోసం  రెండు దశలలో రాష్ట్రస్థా యిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో సెయింట్ లూర్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి వేల్పుల జాన్‌ అబ్రహం  రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. అన్​ఎయిడెడ్​ ప్రైవేట్​ స్కూల్స్​ ఫెడరేషన్​ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల సుదర్శన్​, యర్రగుంట్ల అరుణ దంపతుల కుమారుడు జాన్​ అబ్రహం APGPCET లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడంతో ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపారు. 

About Author