PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐదు రోజుల ఉద్యోగం.. రూ. 5 ల‌క్ష‌ల జీతం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : లండన్‌కు చెందిన ఓమ్ని అనే కంపెనీ ఓ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఐదు రోజుల ఉద్యోగానికి రూ.5 లక్షల జీతం ఇస్తుంది. ఐదు రోజుల ఉద్యోగం చేరాక ఏం చేయాలంటే.. ఆ కంపెనీ తయారుచేసే ఫుడ్‌ తిని ఎలా ఉందో కంపెనీకి చెప్పాలి. తిన్నప్పుడు శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి. కడుపులో ఏమైనా తిప్పినట్టు అనిపించిందా.. ఇలా అన్ని రకాల వివరాలు ఇవ్వాలి. ఈ ఆహారాన్ని మొరం గడ్డ, బీన్స్‌, బ్రౌన్‌ రైస్‌, గుమ్మడి, బ్లూ బెర్రీలు, బఠాణీలు వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ప్యూర్‌ వెజ్ ఫుడ్. ఈ ఉద్యోగం కేవలం బ్రిటన్‌ వాసులకు మాత్రమే అంటూ కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఈ ప్ర‌క‌ట‌న మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

                           

About Author