PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పుష్ప’ ఆన్‌ సెట్స్‌

1 min read

సినిమా డెస్క్​: స్టార్ హీరోలంతా ఒక్కొక్కరుగా సెట్స్‌కి వెళ్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ షూటింగ్ కూడా నిన్న సికింద్రాబాద్‌లో రీస్టార్ అయ్యింది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈసారి బ్యాలెన్స్‌ లేకుండా ఫస్ట్ పార్ట్‌కి సంబంధించిన షూట్‌ని గ్యాప్‌ ఇవ్వకుండా చేసేయాలనుకుంటున్నారు. అయితే దీనికోసం నలభై ఐదు రోజుల పాటు షూట్ చేయాల్సి ఉందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం బన్నీ, విలన్‌గా నటిస్తున్న ఫహాద్‌ల మధ్య యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సీన్స్ సినిమాకే హైలైట్‌ అట. ఆగస్టు నెలాఖరులోగా చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. అయితే ఈ చిత్రాన్ని ఆగస్టు 13న రిలీజ్‌ చేయలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని దసరా రేస్‌లో నిలిపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రష్మిక మందాన్న హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

About Author