PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్ల‌యింగ్ టాక్సీ ప్ర‌యోగం స‌క్సెస్ !

1 min read

పల్లెవెలుగువెబ్: ఫ్ల‌యింగ్ ట్యాక్సీని చైనాలోని గువాంగ్జు కు చెందిన ఎక్స్ పెంగ్ ఐఎన్ సీ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం. దీన్ని సోమవారం దుబాయిలో విజయవంతంగా పరీక్షించి చూశారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్లయింగ్ ట్యాక్సీకి సంబంధించి ఎన్నో ప్రాజెక్టులు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉండడం గమనార్హం. అందులో ఎక్స్ పెంగ్ కూడా ఒకటి. విజయవంతంగా పరీక్షించినప్పటికీ, ఇది వెంటనే అందుబాటులోకి రావడం కష్టమే. ఇంకా చాలా రకాలుగా పరీక్షల తర్వాతే ఇది సాధ్యపడుతుంది. అందుకు కొన్ని సంత్సరాల సమయం కూడా తీసుకోవచ్చు. ఎక్స్ పెంగ్ రూపొందించిన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలో ఇద్దరు ప్రయాణించొచ్చు. స్లీక్ గా ఉండే ఇది గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. మనుషులు లేకుండా సోమవారం పరీక్ష నిర్వహించామని, మనిషితో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ నడిపే పరీక్షను తాము 2021 జూలైలోనే పూర్తి చేసినట్టు ఎక్స్ పెంగ్ తెలిపింది.

                                    

About Author