PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనుచరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటా

1 min read

– పేదవాడి కడుపు కొట్టడం దుర్మార్గం
– ఉద్దేశ్యంతో చేస్తున్నారా లేక నీచ రాజకీయమా..
– పెద్దచెప్పలి ఘటనపై సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : మండలంలోని పెద్దచెప్పలి గ్రామంలో మహబూబ్ బాషా‌ అనే వ్యక్తి కూరగాయల దుకాణాన్ని గురువారం సుమారు అర్థరాత్రి దాటిన తరువాత గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు. మహబూబ్ భాషా టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ అనుచరుడు కావడంతో జీవనోపాధి కోసం సాయినాథ్ శర్మ తన స్వంత స్థలంలో ఎటువంటి అద్దె వసూలు చేయకుండా స్వయంగా దుకాణానికి ఆర్థిక సహాయం అందించారు. మహబూబ్ భాషా దుకాణం ఇంతకు ముందు కూడా మూడుసార్లు ఇప్పటి మాదిరిగానే దుండగులు దగ్ధం చేశారు. ప్రతీసారీ సాయినాథ్ ఆర్థికంగా ఆదుకొంటూ దుకాణాన్ని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం పెద్దచెప్పలిలో దగ్ధమైన కూరగాయల దుకాణాన్ని పరిశీలించి మహబూబ్ భాషాకు ఆర్థిక సహాయాన్ని అందించారు.ఒకటి రెండుసార్లు అయితే పొరపాటున జరిగిందనుకోవచ్చు నాలుగుసార్లు జరిగిందంటే ఉద్దేశంతో చేస్తున్నారో లేక నీచ రాజకీయాల్లో భాగమో అర్థం కావడం లేదన్నారు. ఏది ఏమైనా నా అనుచరులకు, అభిమానులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తా.పదేపదే జరుగుతున్న ఇలాంటి ఘటనలపై పోలుసులు ప్రత్యేక దృష్టి సారించి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుడు మహబూబ్ భాషా మాట్లాడుతూ తాను సాయినాథ్ శర్మకు అభిమానిగా ఉండటంతోనే పదేపదే ఇలా చేస్తున్నారని వాపోయారు.

About Author