NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యూకేఆర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

1 min read

– శ్రీశైలం పాదయాత్రికులకు ఉచిత అన్నదాన కార్యక్రమం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి కాలినడకన వెళుతున్న శివ స్వాములకు, పాదయాత్రికులకు యూకేఆర్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం  ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నందికొట్కూరు పట్టణంలో ఎన్టీఆర్ జలాశయం సమీపంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాని వైసీపీ నాయకులు కౌన్సిలర్ ఉండవల్లి ధర్మా రెడ్డి  ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహకారంతో యూకేఆర్ ( బ్రాహ్మణ కొట్కూరు వైసీపీ నాయకులు ఉదయ్ కిరణ్ రెడ్డి ) యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.శుక్రవారం నుండి 5 వ తేదీ మంగళవారం  వరకు ఐదు రోజుల పాటు శ్రీశైలానికి కాలినడకన వెళ్ళే భక్తులకు, శివ స్వాములకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందన్నారు.కార్యక్రమంలో  యూకేఆర్ యూత్ సభ్యులు పండు, వంశీ, హరి, మహేష్, సాయి, చింటూ రాజేష్, మధు , కిరణ్, తిరుమలేష్, రవి, ధను, తదితరులు పాల్గొన్నారు.

About Author