PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కృష్ణ నందిలో అన్నదాన కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన కృష్ణ నందిలో కార్తీక పౌర్ణమి ని పురస్కరించుకొని గత 15 సంవత్సరాల నుంచి దాతల సహకారంతో కార్తీక పౌర్ణమి రోజున నంద్యాల నూనెపల్లి ప్రాంతానికి చెందిన వెంకటసుబ్బయ్య యాదవ్ ఎంతో వేయ ప్రయాసలతో కాలినడకతో వస్తున్న శివ భక్తులకు కడుపు నింపాలనే దృఢ సంకల్పంతో సుమారుగా 2500 నుంచి 3000 మంది దాకా ఉదయం అల్పాహారము మధ్యాహ్నము భోజనం ఏర్పాటు చేయడమైనది వెంకటసుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ నేను గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నాకు చాలా సంతోషకరంగా ఉందని అలాగే నాకు అన్నదానానికి సహకరిస్తున్న అటువంటి దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం యాదవ నిత్య అన్నదాన సేవా సమితి అధ్యక్షులు గొర్ల సత్యనారాయణ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు బోధనం చంద్రశేఖర్ యాదవ్ అన్నదానానికి సహకరించిన దాతలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author