NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

2008 డీఎస్సీ అభ్యర్థుల‌కు..ఎస్జీటీ పోస్టింగ్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: 2008 డీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థుల‌కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అప్పట్లో ప‌రీక్షలు రాసిన 2,193 మందికి పోస్టింగులు ఇవ్వనున్నట్టు మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. వీరి కోసం ప్రత్యేక నియామ‌క ప్రక్రియ చేప‌ట్టనున్నట్టు తెలిపారు. 2,193 మంది అర్హుల‌కు ఎస్జీటీ పోస్టింగులు ఇవ్వనున్నట్టు, మినిమ‌మ్ టైం స్కేల్ తో ప‌నిచేసేందుకు అభ్యర్థులు రాత‌పూర్వక అంగీకారం తెలిపినట్టు మంత్రి ఆదిమూల‌పు సురేష్ చెప్పారు. ప్రత్యేక ప‌రిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని 2008 డీఎస్సీ అభ్యర్థుల‌కు మాత్రమే అవ‌కాశం ఇచ్చిన‌ట్టు, ఇందుకు సంబంధించిన జీవో త్వర‌లో విడుద‌ల చేయ‌నున్నట్టు ఆయ‌న తెలిపారు.

About Author