PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందరికీ.. ఆనందయ్య మందు..

1 min read

– ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటి నియోజకవర్గంలో ఉన్న ప్రతికుటుంబానికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం కరోనాతో బాధపడుతున్న వారికి ఆనందయ్య మందు పంపిణీ చేశారు. వైరస్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి బంధువులకు కూడా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సోకిన వారికోసం మంగళవారం నుంచి నియోజకవర్గ పరిధిలోని మండలాలలో ప్రతి ఎంపిడిఓ దగ్గర 100 , మున్సిపల్ కమిషనర్ వద్ద 200 ప్యాకెట్ల ఆనందయ్య మందును నిల్వ ఉంచుతాం. కరోనాతో బాధపడేవారికి ఈ మందును ఉచితంగా అందజేస్తాం. కరోనా రానివారికి బుధవారం నుంచి ఆనందయ్య మందు ఉచిత పంపిణీని మండలాల వారీగా ప్రారంభించి పది రోజుల్లో పంపిణీ పూర్తి చేయిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జడ్పి టిసి వెంకటేశ్వర్లు రెడ్డి, వై సి పి నాయకులు జిన్నా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

About Author