PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విభిన్న ప్రతిభావంతులకు.. 407 ఉపకరణాలు అందజేత

1 min read

– విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ విజయ
పల్లెవెలుగు వెబ్​, దేవనకొండ: జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో స్వచ్ఛంద సంస్థల ద్వారా రూ.50లక్షలు విలువ చేసే 407 ఉపకరణాలు పంపిణీ చేశామని తెలిపారు ఆ శాఖ ఏడీ విజయ. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిషత్​ కార్యాలయం ప్రాంగణంలో సోమవారం పీటీసీ ఫౌండేషన్​, పీటీసీ ఇంజనీర్స్​ వారి సౌజన్యంతో ఆలీంకో, కాన్పూర్​ వారి ఆధ్వర్యంలో వివిధ ఉపకరణాలు అందజేశారు. రూ. 50లక్షలు విలువైన 407 ఉపకరణాలను 244 మందికి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్​ డైరెక్టర్​ విజయ మాట్లాడుతూ కలెక్టర్​ పి. కోటేశ్వరరావు, జాయింట్​ కలెక్టర్​ ( ఆసరా మరియు వెల్ఫేర్​) ఎంకేవీ శ్రీనివాసులు ఆదేశానుసారం… పీటీసీ ఫౌంటేషన్​ సహకారం… ఆలీంకో, కాన్నూర్​ వారి నేతృత్వంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో దేవనకొండ ఎంపీడీఓ ఆదయ్య, ఆలీంకో మేనేజర్​ రాజేష్​, పీటీసీ ఫౌండేషన్​ మేనేజర్​ వియష్​ శంకర్​, కమ్యూనిటీ హెల్త్​ ఆఫీసర్​ శాంత, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

About Author