PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి పేద వాడికి.. గూడు..

1 min read

– జగనన్న కాలనీకి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి
– పెద్దనేలటూరలో రోడ్డుకు శంకుస్థాపన
పల్లెవెలుగు వెబ్​, గోనెగండ్ల:ప్రతి పేద వాడికి గూడు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అన్నారు. శుక్రవారం గోనెగండ్లలోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్న సంకల్పంతో సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ. లక్ష 80వేలు మంజూరు చేశారని, పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నవరత్నాలతో ప్రజల ఆదరాభిమానం పొందిన సీఎం జగన్​… దేశంలోనే ఉత్తమ సీఎంగా పేరు సంపాదించారన్నారు. అంతకు ముందు పెద్దనేలటూరు గ్రామంలో ఎమ్మెల్యేతోపాటు వైసీపీ సీనియర్​ నాయకులు ఎర్రకోట జగన్​మోహన్​ రెడ్డి, సర్పంచ్​ సోమన్న రోడ్డు నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. కార్యక్రమంలో మండల ప్రతేకాధికారి సుధాకర్, తహశీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఆర్ డబ్ల్యూ ఎస్ డి ఈ శ్రీనివాస్ రెడ్డి,ఏ ఈ శ్రీనివాస రెడ్డి, హౌసింగ్ ఏ ఈ లక్ష్మన్న,ఎన్ ఆర్ ఈజిఎస్ బుజ్జయ్య,ఆర్ ఐ సునీల్ కుమార్, సి ఐ మంజునాథ్, ఎస్ ఐ శరత్ కుమార్ రెడ్డి,వీఆర్వోలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, మండల కో ఆప్షన్ మెంబర్ బందే నవాజ్, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు వైస్ చెర్మెన్ మన్సూర్, భాస్కర్ రెడ్డి, మురళి నాయుడు, బజారి, మునెప్ప, కౌలుటలయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author