PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీ, బిస్కెట్ల కోసం.. 8 కోట్ల ఖ‌ర్చు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఒక సంవ‌త్సరానికి టీ, బిస్కెట్ల ఖ‌ర్చు 8 కోట్లు రూపాయ‌ల‌ట‌. ఇది వింటే ఆశ్చర్యంగా లేదూ. ఒక ప్రభుత్వ శాఖ‌లో టీ,బిస్కెట్ల కోసం చేసిన ఖ‌ర్చు ఇది. సుప‌రిపాల‌న వేదిక కార్యద‌ర్శి ప‌ద్మనాభ‌రెడ్డి గ‌వ‌ర్నర్ కు పంపిన లేఖ‌లో ఈ విష‌యాన్ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రోటోకాల్ శాఖ‌లో నిధుల దుర్వినియోగం జ‌రిగింద‌ని ఆయ‌న లేఖ‌లో గ‌వ‌ర్నర్ కు విన్నవించారు. ప్రముఖుల అధికారిక లేదా అన‌ధికారిక ప‌ర్యట‌న‌ల్లో ఆహారం, బ‌స‌, ర‌వాణ వంటి విష‌యాలు ప‌ర్యవేక్షించే శాఖ ప్రోటోకాల్ శాఖ‌. ఈ శాఖ ప్రజాధ‌నాన్ని విచ్చల‌విడిగా ఖ‌ర్చు చేసింద‌ని ప‌ద్మానాభ‌రెడ్డి పేర్కొన్నారు. బ‌డ్జెట్ ప‌ద్దు 132 కింద ఇత‌ర ఖ‌ర్చుల్లో టీ, బిస్కెట్ల కోసం ఏడాదికి 8 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు ఉంద‌న్నారు. 2021-22 సంవ‌త్సరానికి అద్దె కార్లకు బ‌డ్జెట్ ప‌ద్దు 134 కింద 8.9 కోట్లు కేటాయించిన‌ట్టు ఉంద‌ని, ఈ రెండు విష‌యాల పై విజిలెన్స్ లేదా ఏసీబీతో విచార‌ణ చేయించాల‌ని గ‌వ‌ర్నర్ కు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.

About Author