PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెళ్లి చేసుకునేవారికి.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స‌ల‌హా !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నెటిజ‌న్లకు అప్పుడ‌ప్పుడు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తుంటారు. తాజాగా పెళ్లి గురించి స్మృతి ఇరానీ ఓ స‌ల‌హా ఇచ్చారు. జీవితానికి సంబంధించిన ఫ‌న్నీ స‌ల‌హాల‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేశారు. వివాహం విష‌యంలో ‘ మీరు ఒక వ్యక్తిని పెళ్లాడే ముందు.. ఆ వ్యక్తితో స్లో ఇంట‌ర్నెట్ కంప్యూట‌ర్ ఇచ్చి దాని మీద ప‌నిచేయ‌మ‌ని చెప్పండి. త‌ద్వార ఆ వ్యక్తిలో స‌హ‌నం ఏ మేర‌కు ఉందో అర్థమ‌వుతుంది. ఆ స‌మ‌యంలో ఆ వ్యక్తి ప్రవర్తించే తీరు ప‌రిశీలిచండి. ఆ త‌ర్వాత ఓ అంచ‌నాకు వ‌చ్చి పెళ్లి చేసుకోండి’ అంటూ ఇన్ట్సాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

About Author