PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైలు బుకింగ్ కోసం రూ. కోటి డిపాజిట్ !

1 min read

Passenger train in the Countryside near Pune India.

ప‌ల్లెవెలుగువెబ్ : రైలు నడిపేందుకు ఓ వ్యక్తి రూ. కోటి డిపాజిట్‌ చేశాడని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు.‘భారత్‌ గౌరవ్‌’ పథకం కింద కోయంబత్తూర్‌-షిర్డీ మధ్య ఈ రైలు న‌డుస్తుంది. భారతదేశంలో ఉన్న పారంపర్య, సంస్కృతి, ఆధ్యాత్మిక, పర్యాటక స్థలాల సందర్శనకు విదేశాలకు చెందిన వారిని తీసుకెళ్లేందుకు భారత్‌ గౌరవ్‌ పథకాన్ని రైల్వేశాఖ ప్రకటించింది. ఆ ప్రకారం ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు బుకింగ్‌ చేసుకొని రైలు నడుపువచ్చు. ఆ ప్రకారం రైళ్ల పర్యవేక్షణ, స్టాపింగ్‌ వంటి సౌకర్యాలకు రైల్వే శాఖ సహాయం చేస్తోంది. రైళ్లు నడపడం మాత్రమే ప్రైవేటు సంస్థల పని. ఈ నేపధ్యంలో, మేలో కోయంబత్తూర్‌-షిర్డీ మధ్య భారత్‌ గౌరవ్‌ రైలు నడిపేందుకు ఓ వ్యక్తి రూ. కోటి డిపాజిట్‌ చేశారని, దక్షిణ రైల్వేలో ఏడుగురు వ్యక్తులు ఈ పథకం కింద రైళ్లు నడిపేందుకు నమోదుచేసుకున్నారని దక్షిణ రైల్వే తెలిపింది.

                                 

About Author