PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నాళ్ళకెన్నాళ్లకు.. గుర్తుకొస్తున్నాయి..!

1 min read

– పూర్వ విద్యార్థుల.. ఆత్మీయ కలయిక..
– 20 ఏళ్ల తరువాత కలిసిన స్నేహబంధం..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి మధుర జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు… చేసే అల్లరి… స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు… వారితో కలిసి ఆడిన ఆటలు… చిన్న చిన్న గ్యాంగ్​లు… అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 20 ఏళ్ల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు.. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం వడ్డేమాన్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు. వడ్డెమాన్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 20 ఏళ్ళ తీపి జ్ఞాపకాలను స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 2002-2023 విద్యా సంవత్సరం నాటి పూర్వపు విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత వారు చదువుకున్న పాఠశాలలో కలుసుకుని ఆనందంగా గడిపారు.వాట్సప్ వేదికగా గత మూడు నెలల నుంచి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఒకరోజు ముందుగానే గ్రామాలకు చేరుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. వారు చదువుకున్న రోజుల్లో కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సందడి చేశారు. ముందుగా వందేమాతరం గేయం ఆలపించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేశారు. అనంతరం మృతి చెందిన గురువులు, స్నేహితులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు .చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ లాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయురాలు ఫాతిమాభి, కొచ్చేరువు హెడ్మాస్టర్ మురళీధర్ రెడ్డి, సరస్వతి, సంపూర్ణ, కృష్ణమూర్తి, లైబ్రరీ శంకరయ్య, ఆంజనేయులు, పూర్వ విద్యార్థులు నల్లమల్ల స్వాములు , సగినేల నాగరాజు, జగన్, కిరణ్ ,మునిస్వామి, రఘురామయ్య, సాంబశివుడు ,దేవేంద్ర గౌడ్, అనిల్, వీరితోపాటు దాదాపు 100 మంది పాల్గొన్నారు.

About Author