NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు టిడిపి పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

1 min read

సమాజమే దేవాలయం,ప్రజలే దేవుళ్ళు నినాదంతో ఎన్టీఆర్ టిడిపి పార్టీని స్థాపించారు

జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు

కూటమి ప్రభుత్వంతోనే పార్టీ మరింత బలోపేతం

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)

పాల్గొన్న జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ,మేయర్ షేక్ నూర్జహాన్,పార్టీ ప్రతినిధులు,కార్యకర్తలు, అభిమానులు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన 43 వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినాదం తో అన్న దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు  తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు అని, ప్రజలు కోసం ఎక్కువగా పాటుపడింది ఒక్క తెలుగుదేశం పార్టీ అని, ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఉప్పాల జగదీష్ బాబు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, ఏలూరు నగర మేయర్ నూరజహాన్ పెదబాబు, బేగం, దాసరి ఆంజనేయులు, ఏలూరు నియోజకవర్గం పరిశీలకులు షేక్ మీరా సాహెబ్,శర్మ,మధ్యానపు బలరాం, కరణం.పెద్దిరాజు, దూసంపూడి పుల్లయ్య, చలసాని కృష్ణ చైతన్య, నాయుడు,కడియాల విజయలక్ష్మి, పెద్దిబోయిన శివ ప్రసాద్,రెడ్డీ నాగరాజు, కొల్లేపల్లి రాజు, వందనాల శ్రీనివాసరావు,తవ్వ అరుణ కుమారి, పిల్లరిశెట్టి సంధ్య సురేష్,వానపల్లి నాగరాజు, బౌరోతూ బాలాజీ, నెరుసు గంగరాజు,పూజారి నిరంజన్,జంపా సూర్యనారాయణ,ఎస్. దుర్గాప్రసాద్, సిహెచ్. శ్రీనివాసరావు,కలవకొల్లు సాంబ, ఘంటా వివి ఎస్ఎస్. ప్రసాద్,బి.ధనలక్ష్మి, జ్యోతి, రంగమ్మ, సరిత, లంకపల్లి మాణిక్యాలరావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం స్వీట్స్ పంచి ఆనందం వ్యక్తం చేసుకున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *