PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ ముఖ్య‌మంత్రికి నాలుగేళ్ల జైలు శిక్ష‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోకదళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. 50 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయాలని కూడా న్యాయమూర్తి వికాస్ ధుల్ ఆదేశించారు. తీర్పు సమయంలో చౌతాలాలో కోర్టురూంలోనే ఉన్నారు.

                                       

About Author