PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ సీఎం కొడుకు !

1 min read

పల్లెవెలుగువెబ్ : గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కొడుకు ఉత్పల్ పారికర్ బీజేపీకి రాజీనామా చేశారు. పనాజీ అసెంబ్లీ సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఉత్పల్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక తాను బీజేపీలో కొనసాగలేనంటూ శుక్రవారం తన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. అదే సమయంలో పనాజీ స్థానం నుంచే ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీగా దిగుతానని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా పనాజీ స్థానాన్ని ఆశిస్తున్న ఉత్పల్‌ పారికర్‌కు బీజేపీ గురువారమే షాక్‌ ఇచ్చింది. ఆ స్థానాన్ని సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు ఇవ్వడంతో ఉత్పల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అయితే పనాజీ కాకుండా బీజేపీ అధిష్టానం సూచించిన రెండు స్థానాల నుంచి పోటీ చేయడానికి ఉత్పల్‌ నిరాకరించారు.

           

About Author