PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ పార్టీ  కి పూర్వ వైభవం : అమీన్ భాయ్

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగిడుగు రుద్దరాజు నాయకత్వంలో వచ్చిందని రాష్ట్ర మైనార్టీ వైస్ చైర్మన్ అమీన్ బాయ్ అన్నారు. స్థానిక ఆంధ్ర భవన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా , ప్రస్థానం మొదలుపెట్టి , యువజన కాంగ్రెస్ రాష్ట్ర, పిసిసి కమిటీల లో వివిధ హోదాలలో పనిచేసి ఏఐసీసీ జాతీయ కార్యదర్శిగా తో పాటు వివిధ రాష్ట్రాలకు ఇన్చార్జిగా వ్యవహరించి, విజయవంతం అయ్యిఅధిష్టానం  చేత  *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమింపబడి అప్పుడే ఒక సంవత్సరకాలంం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న నిరాడంబరుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉండే ప్రజా నాయకుడు  గిడుగు రుద్రరాజు అన్నారు. సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు .  మీ హయాంలో పార్టీకి కొత్త ఊపునిస్తున్నందుకు  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్ర భవనమును కార్పొరేట్ స్థాయిలో ఆధునికరించి దశాబ్దాలుగా  రాష్ట్ర వ్యాప్తంగా  పార్టీ  ఆధ్వర్యంలో ఉన్న భవనములకు ఆస్తి పన్ను ఒకేసారి చెల్లింపులు చేసి ,  ఏఐసిసి నిర్దేశించిన కార్యక్రమాల తో కార్యకర్తలు నాయకులలో నూతన ఉత్తేజ నింపుతూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను విజయవంతం చెస్తూ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇంత జనబలం ఉందా అని ఇతర పార్టీ వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ ఈయన గిడుగు కాదు పిడుగు అని ఇతరులు సంబాషణ చేసుకుంటున్నారు అన్నారు. రాబోవు రోజుల్లో ఆంధ్ర…మీ హయాంలో కాంగ్రెస్ హస్తగతం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. అలాగే   రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లో  మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న మా నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి సుంకర పద్మశ్రీ  ,జంగా గౌతమ్ ,  పి, రాకేష్ కు హృదయ పూర్వక శుభాకాంక్షలు, ప్రకటనలో తెలియజేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం కోసం అహర్నిశలు కృషి చేస్తూన్నమా నాయకుడు రుద్ర రాజు నాయకత్వంలో మేమంతా కలిసి పని చేస్తామని అమీన్ భాయ్  చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author