PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రపతి ని కలిసిన సంసద్ మహారత్న అవార్డు గ్రహీత ,రాజ్యసభ మాజీ సభ్యులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  న్యూఢిల్లీలో ఈనెల 17వ తేదీ న్యూ మహారాష్ట్ర సదన్ లో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న సమయంలో ఆరు శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా చేసిన అత్యుత్తమ కృషికి గాను సంసద్ మహారత్న అవార్డు అందుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ న్యూఢిల్లీలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు సంసద్ మహారత్న అవార్డు జ్ఞాపికలను, ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. 2019 నుంచి 2022 వరకు ఆరు శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అత్యుత్తమ సేవలు అందించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్కు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే సంస్థ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ చేతుల మీదుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందుకున్న విషయం తెలిసిందే .ఈ నేపథ్యంలో రాజ్యసభ మాజీ సభ్యులు వెంకటేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసి ఆమె చే అభినందనలు, ప్రశంసలు అందుకున్నారు.

About Author