PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులను అభినందించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని సంకల్భాగ్ లో ఉన్న తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ క్వెస్ట్ ఒలంపియాడ్ లో పాల్గొని ప్రతిభ కనబరిచిన నగరంలోని ఎన్ఆర్ పేట భాష్యం పాఠశాలకు చెందిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారికి నగదు ప్రోత్సాహకాలతో పాటు మెడల్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ భాష్యం పాఠశాల విద్యార్థులు క్వెస్ట్ ఒలంపియాడ్ లో ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారుమ భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షల్లో ఈ విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆశీర్వదించారు. అనంతరం భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ క్వెస్ట్ ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర ,జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచారని చెప్పారు .వారికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలతో పాటు మెడల్స్ ను అందజేసినట్లు వివరించారు. విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా ఇలాంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంలో భాష్యం పాఠశాల ఎప్పుడు ముందు ఉంటుందని తెలియజేశారు.

About Author