NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీరజ రెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తూ నిన్న ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పాటిల్ నీరజారెడ్డి మృతదేహాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సందర్శించి నివాళి అర్పించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చురీ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే శ్రీమతి నీరజారెడ్డి భౌతికకాయాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కపిలేశ్వరయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.శ్రీమతి నీరజ రెడ్డి రహదారి ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందటం పట్ల రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన తీవ్ర దిగ్బ్రాంతిని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

About Author