PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాలనలో సీఎం జగన్‌ ఘోర వైఫల్యం: మాజీ ఎంపీ ఉండవల్లి

1 min read


పల్లెవెలుగు వెబ్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్ల పాలనలో జగన్ ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. తన పాలనలో అవినీతి లేకుండా చేస్తానని ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ అన్నారని.. అయితే ఇప్పుడు ఆ మాట అనగలరా? అని సవాల్ విసిరారు.
వైసీపీ సర్కార్ విచ్చలవిడిగా అప్పులు చేస్తూ పోతుందని.. గత రెండేళ్లలో రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఉండవల్లి వివరించారు. మూడు రాజధానుల బిల్లు విషయంలో సర్కార్ వైఫల్యం స్పష్టం కనబడుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీల సలహాలు తీసుకుంటే సర్కార్‌కు మంచి‌పేరు వస్తుందని… ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నిర్వహించడం మంచి సంప్రదాయం కాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం అవివేకం అవుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవ‌డాన్ని తాను డ్రామా అని అనుకోవడం లేదని చెప్పారు. అయితే సానుభూతి కోసం అలా చేస్తే అవేం ప‌నిచేయ‌బోవ‌న్నారు.

About Author