PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ ప్ర‌ధాని దేవెగౌడ కుటుంబం అరుదైన రికార్డు !

1 min read
                ప‌ల్లె వెలుగు వెబ్ :   దేశ రాజ‌కీయాల్లో ఒకే కుటుంబం నాలుగు చ‌ట్ట‌స‌భ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రికార్డును మాజీ ప్ర‌ధాని దేవెగౌడ కుటుంబం సొంతం చేసుకుంది. పార్ల‌మెంట్ తో పాటు క‌ర్ణాట‌క ఉభ‌య‌స‌భ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుటుంబంగా రికార్డుకెక్కింది. తాజా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో దేవెగౌడ మ‌న‌వడు సూర‌జ్ ఎమ్మెల్సీ గా గెలుపొంద‌డంతో ఈ రికార్డు సొంత‌మైంది. దేవెగౌడ రాజ్యస‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతుండ‌గా.. చిన్న‌కుమారుడు కుమార‌స్వామి చెన్న‌పట్నం ఎమ్మెల్యేగా ఆయ‌న భార్య అనిత రామ‌న‌గ‌ర ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. దేవెగౌడ పెద్ద కుమారుడు రేవ‌ణ్ణ హొలెనర్సిపుర నుంచి ఎమ్మెల్యేగా, రేవణ్ణ భార్య జిల్లా ప‌రిష‌త్ స‌భ్యురాలిగా.. రేవణ్ణ త‌నయుడు ప్ర‌జ్వ‌ల్ ఎంపీగా, మ‌రో త‌న‌యుడు సూర‌జ్ ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు. కుమార‌స్వామి కొడుకు నిఖిల్ జేడీఎస్ యూత్ వింగ్ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నాడు.

     

About Author