PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లైవ్ డెమోను పరిశీలించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నగరంలోని బాలాజీ ఏజెన్సీస్ లో ఏర్పాటుచేసిన ఆహుజా, స్టూడియో మాస్టర్ సౌండ్ సిస్టంల లైవ్ డెమో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డి ,జనరల్ మేనేజర్ ఎస్ కే మహేష్, అహుజా సంస్థ ఏరియా సేల్స్ మేనేజర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ బాలాజీ ఏజెన్సీస్ లో ఏర్పాటుచేసిన అహుజా కంపెనీకి సంబంధించి సౌండ్ సిస్టంలను పరిశీలించారు. వాటికి సంబంధించిన అధునాతన టెక్నాలజీ వివరాలను సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. బాలాజీ ఏజెన్సీస్ లో ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టంలకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రతినిధులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు వివరించారు. అనంతరం ఆహుజా సంస్థ ఏరియా సేల్స్ మేనేజర్ విశ్వనాథ్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో అహుజా సంస్థకు సంబంధించి అధికారిక డీలర్ అయిన బాలాజీ ఏజెన్సీస్ లో ప్రతి సంవత్సరం నూతన టెక్నాలజీ మార్కెట్లకు వచ్చిన సౌండ్ సిస్టంలకు సంబంధించి లైవ్ డెమో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీనివల్ల వినియోగదారులు వాటిని ప్రత్యక్షంగా పరిశీలించి తమకు నచ్చిన సౌండ్ సిస్టం లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే తమ తమ వద్ద సర్వీసు అవకాశం కూడా ఉందని వివరించారు .ఈ లైవ్ డెమో కార్యక్రమాన్ని ప్రజలు సందర్శించి తమకు ఇష్టమైన సౌండ్ సిస్టంలను కొనుగోలు చేయాలని వారు కోరారు.

About Author