PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కి ప్రతిష్టాత్మక సంసాద్ రత్న అవార్డు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మాజీ రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ కమిటీ మాజీ చైర్మన్ టిజి వెంకటేష్ గారు ప్రతిష్టాత్మక సంసాద్ రత్న అవార్డును ఈరోజు అందుకున్నారు.దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలతో ప్రారంభించిన ప్రేమ్ పాయింట్ ఫౌండేషన్ సంస్థ ఈ సంసాద్ రత్న అవార్డును ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా టీజీ వెంకటేష్ కు అందజేశారు.2019 సంవత్సరం నుండి 2022 సంవత్సరం దాకా ఎంపీగా, పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా టీజీ వెంకటేష్ అందించినటువంటి ఉత్తమ సేవలకు గాను అయినను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టుగా నిర్వాహకులు తెలిపారు. సకాలంలో ఎంపీ నిధుల వినియోగం, పార్లమెంటులో చర్చలపై నిబద్ధత తదితర అంశాలను ప్రాతిపదికన చేసుకొని ఈ అవార్డును అందజేయనున్నట్లు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ వారు తెలిపారు. ఢిల్లీలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయి రెడ్డి, టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.

About Author